ఉక్రెయిన్ పై ఐక్య రాజ్య సమితి నిర్ఘాంతపోయే నివేదిక

by సూర్య | Sat, May 14, 2022, 01:47 PM

రష్యా దాడులతో అతలాకుతలమైన ఉక్రెయిన్ లోని పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి నిర్ఘాంతపోయే నివేదిక  ఇచ్చింది. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. ఉక్రెయిన్‌ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలుగా ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ను వదిలి ఇత‌ర దేశాల‌కు వెళ్లార‌ని ఐక్యరాజ్య సమితి తాజాగా తెలిపింది. వారిలో మహిళలు, పిల్లలే 90 శాతం మంది ఉన్నార‌ని వివ‌రించింది. 


ఉక్రెయిన్ నుంచి అధిక మంది పోలండ్ కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నార‌ని, పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉండ‌డంతో ఉక్రెయిన్‌లోనే ఉంటుందున్నా‌ర‌ని పేర్కొంది. ఉక్రెయిన్ లో మరో 80 లక్షల మంది సొంత‌ దేశంలో ప‌లు ప్రాంతాలకు మారార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంద‌ని చెప్పింది. 


ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభ‌మైంది. మార్చి నెలలో ఉక్రెయిన్‌ నుంచి 30 లక్షల మందికి పైగా ప్ర‌జ‌లు విదేశాల‌కు వెళ్లారు. ఏప్రిల్‌ నాటికి వ‌ల‌స వెళ్లిన వారి సంఖ్య 10 లక్షల మందికి పైగా చేరింది. ఈ నెల 4,93,000 మంది ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటారు. 2022 ముగిసేలోపు మొత్తం 80 లక్షల మంది విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.  

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ.. 3 కి.మీ మేర బారులు Sun, May 19, 2024, 09:26 AM
23న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం Sun, May 19, 2024, 09:22 AM
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM