క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో దారుణం

by సూర్య | Sat, May 14, 2022, 11:36 AM

క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడు తన మేనమామను దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత తలను చేతిలో పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​ రాష్ట్రం సీధీ జిల్లాలోని కరి మాటి గ్రామంలో జరిగింది. నిందితుడిని రవీంద్ర సింగ్ గౌర్​(26)గా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కొన్నేళ్ల క్రితం రవీంద్ర సింగ్ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి చావుకు మేనమామ మక్సుదన్ సింగ్ గౌర్ (60) కారణమంటూ రవీంద్ర ఆరోపించేవాడు. అతడు క్షుద్రపూజలు చేయడం వల్లే తన తండ్రి చనిపోయాడని చెప్పేవాడు. ఈ క్రమంలోనే మక్సుదన్ ​పై ప్రతీకారం తీర్చుకుంటానని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఏకంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM