ఈ నెల 18న కీవ్‌లో భార‌త ఎంబ‌సీని పునఃప్రారంభం

by సూర్య | Sat, May 14, 2022, 02:20 AM

యుద్దం కొనసాగుతున్నా ఈ నెల 18న కీవ్‌లో భార‌త ఎంబ‌సీని పునఃప్రారంభంకానున్నది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ర‌ష్యా బాంబు దాడుల‌తో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ స‌హా ఆ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నీ పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. యుద్ధానికి ర‌ష్యా ఎప్పుడు ముగింపు ప‌లుకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో భార‌త విదేశాంగ శాఖ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల 18న కీవ్‌లో భార‌త ఎంబ‌సీని పునఃప్రారంభించాల‌ని భార‌త విదేశాంగ శాఖ నిర్ణ‌యించింది. 


ఇదిలా ఉంటే..రెండు నెల‌లుగా ఉక్రెయిన్‌పై బాంబు దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ర‌ష్యా ఇప్ప‌టిదాకా కీవ్‌ను స్వాధీనం చేసుకోలేక‌పోయింది. ఈ కార‌ణంగానే ఆ న‌గ‌రంపై బాంబుల మోత మోగించిన ర‌ష్యా...న‌గ‌రంలోని మెజారిటీ ప్రాంతాల్లో భవ‌నాల‌ను కూల్చేసింది. ర‌ష్యా యుద్ధం ప్రారంభించిన నేప‌థ్యంలో అప్ప‌టిదాకా కీవ్ కేంద్రంగా కొన‌సాగుతున్న ఉక్రెయిన్‌లోని భార‌త ఎంబ‌సీని మార్చి 13న‌ పోలండ్ రాజ‌ధాని వార్సాకు భార‌త్ త‌ర‌లించింది. అయితే ఇప్పుడు చాలా దేశాలు కీవ్ నుంచే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే దిశ‌గా సాగుతున్న నేప‌థ్యంలో భార‌త్ కూడా కీవ్‌లో త‌న ఎంబ‌సీని ఈ నెల 18న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM