by సూర్య | Fri, May 13, 2022, 11:19 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ నెల 20 నుంచి 31 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం జగన్ ఈ నెల 20న కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.మే 22, 23, 24 తేదీల్లో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. వివిధ విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్కు హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Latest News