by సూర్య | Fri, May 13, 2022, 10:59 PM
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం మంటలు వ్యాపించినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News