బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by సూర్య | Fri, May 13, 2022, 07:57 PM

విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని తగ్గించింది. ఈ రెండింటి మధ్య అంతరాన్ని 9 నెలల నుంచి 90 రోజులకు కుదించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులని ప్రకటించింది. దీనిపై విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థుల నుంచి ఆరోగ్య శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని, నిపుణుల సలహా మేరకు ఆ అంతరాన్ని తగ్గించింది. విదేశాలకు వెళ్లేవారు వారు వెళ్లే దేశంలోని రూల్స్ కి తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. తాజాగా ఆ వ్యవధిని 3 నెలలకు తగ్గిస్తూ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

Latest News

 
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM
అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం Tue, Apr 30, 2024, 10:14 AM
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM