by సూర్య | Wed, Jan 19, 2022, 09:55 PM
కర్ణాటక ను కరోనా వణికిస్తుoది. తాజాగా కర్ణాటకలో 40,499 కరోనా కేసులు నమోదయ్యాయి, కరోనా కారణంగా 21 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 23,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,67,650 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుజరాత్లో 20,966 కొత్త కరోనా కేసులలో, 9,828 కరోనా నుండి కోలుకున్నారు. 12 మంది కరోనాతో చనిపోయారు. గుజరాత్లో ప్రస్తుతం 90,726 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 13,785 కరోనా కేసులు నమోదు కాగా, 35 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 16,580 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు 75,282 ఉన్నాయి. తమిళనాడులో 26,981 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 17,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 35 మంది చనిపోయారు. ముంబైలో 6,032 కరోనా కేసుల్లో, 18,241 కరోనా నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మరణించారు. పశ్చిమ బెంగాల్లో 11,447 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి మరియు 15,418 కరోనా కోలుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 మంది కరోనాతో మరణించారు.