by సూర్య | Wed, Jan 19, 2022, 07:38 PM
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. బవుమా (110, 143 బంతుల్లో 8 ఫోర్లు), దుస్సేన్ (129, 96, 9 ఫోర్లు, 4 సిక్సర్లు, నాటౌట్) రాణించడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో డికాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) రాణించారు. ఎక్స్ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. దుస్సేన్, మిల్లర్ నాటౌట్గా నిలిచారు. 297 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.
Latest News