ఆ స్కోర్ దాటితోనే విజయం

by సూర్య | Wed, Jan 19, 2022, 07:31 PM

విజయం కోసంం టీఇండియాకు భారీ స్కోర్  టార్గెట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 పరుగులు, 96 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు.. నాటౌట్) భారత బౌలర్లను చితకబాదడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. డుస్సేన్, మిల్లర్ నాటౌట్ గా నిలిచారు. 297 పరుగుల లక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM