రెండో రోజు కూడా నష్టాలతోనే మార్కెట్

by సూర్య | Wed, Jan 19, 2022, 05:21 PM

కొత్త ఏడాదిలో ఉత్సాహంగా మొదలైన షేర్ మార్కెట్ నిన్నటి నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి పడిపోయింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి దిగజారింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.83%), టాటా స్టీల్ (1.19%), మారుతి సుజుకి (1.17%), యాక్సిస్ బ్యాంక్ (0.55%), టెక్ మహీంద్రా (0.51%).


టాప్ లూజర్స్:


ఇన్ఫోసిస్ (-2.77%), ఏసియన్ పెయింట్స్ (-2.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%), నెస్లే ఇండియా (-2.41%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%).

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM