ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్ర సర్కారు అనుకూలం

by సూర్య | Tue, Jan 18, 2022, 03:02 PM

ఆర్మీ యూనిఫాంల తయారి టెండర్లపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్ర సర్కారు అనుకూలంగా ఉన్నాయంటూ ఆవాడి ఫ్యాక్టరీ ఆరోపించింది. ఇదిలావుంటే దేశ సైనికుల కోసం కొత్త యూనిఫామ్ ను అభివృద్ధి చేయగా.. దీని తయారీ కాంట్రాక్టు విషయమై రాద్దాంతం నడుస్తోంది. కొత్త డిజైన్ తో యూనిఫామ్ ను అమల్లోకి తీసుకురావాలని ఆర్మీ నిర్ణయించింది. దీంతో తయారీ కాంట్రాక్టును తమకే ఇవ్వాలని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు (ఓసీఎఫ్) డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (నిఫ్ట్) సంస్థ సహకారంతో రూపొందించిన కొత్త యూనిఫామ్ ను ఈ నెల 15న ఆర్మీడే సందర్భంగా ప్రదర్శించారు. ప్రస్తుత యూనిఫామ్ మాదిరే పోలికలు కనిపించినా కానీ, కొత్తదనం వచ్చి చేరింది. 13 లక్షల మంది సైనికులకు యూనిఫామ్ ను అందించాల్సి ఉంటుంది. దీంతో ఇది పెద్ద కాంట్రాక్టు కానుంది. కనుక బహిరంగ టెండర్ పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇవ్వాలని ఆర్మీ యోచన. దీనివల్ల వ్యయాలు ఆదా అవుతాయని భావిస్తోంది. దీన్ని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్ర సర్కారు అనుకూలంగా ఉన్నాయంటూ ఆవాడి ఫ్యాక్టరీ ఆరోపించింది. ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు మనుగడ సాగించాలంటే వాటికి ఆర్డర్లు అవసరమని, పోరాట దళాల యూనిఫామ్ ల తయారీలో మంచి అనుభవం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM