by సూర్య | Tue, Jan 18, 2022, 02:23 PM
కరోనా వైరస్ పై ఒక్కో శాస్త్రవేత ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ పై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ మరో ఆరు నెలలకు ఎండెమిక్ స్టేజ్ (సాధారణంగా కనిపించే స్థానిక వ్యాధుల్లో ఒకటిగా) కు వస్తుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు, ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన ఈదర లోకేశ్వరరావు చెప్పారు. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు మాదిరిగా వైరస్ చేరుకుంటుందని చెప్పారు. అయినా కానీ ప్రజలు మాస్క్ లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ గురించి ఆందోళన అక్కర్లేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతున్నట్టు తెలిపారు. అమెరికాలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండడం, టీకాలు అందరూ తీసుకోకపోవడం, అవగాహన లేమితో కేసులు ఎక్కువగా వస్తున్నట్టు చెప్పారు. సరిపడినంత నిద్ర పోవడం, వ్యాయం, ధ్యానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని డాక్టర్ లోకేశ్వరరావు సూచించారు.
Latest News