ప్రధాని లక్ష్యంగా డ్రోన్ల దాడికి ఉగ్ర కుట్ర!
by సూర్య |
Tue, Jan 18, 2022, 12:13 PM
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డ్రోన్ల సాయంతో ఎటాక్ జరిగే అవకాశముందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు దాడులకు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దేశ రాజధానిలో నిఘా పటిష్టం చేశారు. టెర్రరిస్టుల ఏరివేతకు జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
Latest News