వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారు

by సూర్య | Mon, Jan 17, 2022, 09:35 PM

లతా మంగేష్కర్ వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారని, ఆమె ఆరోగ్యవంతురాలు కావడానికి మరికొంత సమయం పడుతుందని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతాకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ పేర్కొన్నారు. గానకోకిల లతా మంగేష్కర్ కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతాకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ తెలిపారు. లతా మంగేష్కర్ వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారని, ఆమె ఆరోగ్యవంతురాలు కావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. లతా మంగేష్కర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM