by సూర్య | Mon, Jan 17, 2022, 09:28 PM
సంక్రాంతి సందర్భంగా ఏపీ లో కోడిపందాలు జోరు బాగా కోనసాగింది కోట్ల లో బెట్టింగ్ లు జరిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా సీసలిలో మూడు రోజుల పాటు కోడి పందేలు జరిగాయి. చిన్న పందాలను రెండు వర్గాలుగా విభజించారు, పెద్ద పందెం. అత్యధికంగా విజయం సాధించిన కృష్ణా జిల్లా కలిదిండి కి చెందిన ఒక వ్యక్తి మరియు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చెందిన మరో వ్యక్తి మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఆదివారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుగులో జరిగిన ఈ కోడి పందేల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు (టీడీపీ) తన సోదరుడు మంతెన పెద్ద నరసింహరాజు కలిసి ఎక్కువ పందాలు గెలిచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆ ఈదారికి రెండు బుల్లెట్లను అందజేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు , ఇద్దరు ఎమ్మెల్యే సోదరులను బైక్లపై ఎక్కించుకుని ఒక రింగ్ చుట్టారు. వీరిద్దరూ పెద్ద ఎత్తున పందాల్లో డబ్బు గెలిచినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.
Latest News