వీరనారి నీవు భళా...ఎందరో ప్రాణాలను కాపాడింది

by సూర్య | Sun, Jan 16, 2022, 08:58 PM

మహిళలు అభలలు కాదు వీరనారి మణులు అంటుంటారు. అలాంటి సాహసమే చేసి వీరనారి అనిపించుకొంది ఓ మహిళా. మామూలుగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా పనులు చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే వాటిని అమలు చేయడం చాలా కష్టం. అందులోనూ పదిమందికి సంబంధించిన విషయంలో అది ఇంకా కష్టం. కానీ ఓ మగువ అలా అనుకోలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని అందరి మన్ననలు పొందింది. బస్సు నడిపే డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఓ 42 ఏళ్ల మహిళ బస్సును నడిపి.. అందరిని గమ్యస్థానాలకు చేర్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. కొంతమంది మహిళలు, పిల్లలు కలసి పూణే సమీపంలో షిరూర్‌లో ఉన్న వ్యవసాయ పర్యాటక కేంద్రానికి వెళ్లారు. దీనికోసం ఓ మిని బస్సును ఏర్పాటు చేసుకున్నారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు బస్సును నడుపుతున్న డ్రైవర్ కళ్లు తిరిగి పడిపోయాడు. రోడ్డుపై బస్సును ఆపి తనకు ఫిట్స్ వచ్చినట్టు సైగలతో చెప్పాడు. బస్సు ఆగిపోవడంతో అందులో ఉన్నవారికి ఏం చేయాలో తోచలేదు. పైగా పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. దాంతో బస్సులో ఉన్న యోగితా సతవ్ అనే మహిళ బస్సును నడపాలని నిర్ణయం తీసుకుని.. ధైర్యంగా బస్సును నడిపి ముందు డ్రైవర్‌‌ను ఆస్పత్రికి తీసుకుకెళ్లారు. మిగతా ప్రయాణికుల్ని కూడా వారి ఇళ్లకు చేర్చారు. తనకు కారు నడపడం తెలుసని, అందుకే ఆ సమయంలో బస్సును నడపాలని అనుకున్నానని యోగితా సతవ్ అన్నారు. ముందు డ్రైవర్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లడం ముఖ్యం అని భావించానని ఆమె చెప్పారు. యోగితా పది కిలోమీటర్ల దూరం బస్సును డ్రైవ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM