by సూర్య | Sun, Jan 16, 2022, 06:49 PM
ఏపీ లో ఈరోజు కొత్తగా 4,570 కేసులు నమోదు అయ్యాయి. ఓ పక్క సామాన్యులు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. దీంతో తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇంకా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి భార్య శచీదేవికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెతో పాటు మంత్రి బాలినేని కూడా హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
Latest News