ఇండియన్‌ రైల్వే శాఖ కీలక నిర్ణయం

by సూర్య | Fri, Jan 14, 2022, 11:12 PM

రైలు గార్డు పేరును మారుస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు గార్డుగా పిలవకూడదని, గార్డు పోస్టును రైలు మేనేజర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసిస్టెంట్ గార్డ్ సీనియర్ గూడ్స్ రైలు మేనేజర్‌గా, సీనియర్ ప్యాసింజర్ గార్డ్ సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్ మరియు మెయిల్ / ఎక్స్‌ప్రెస్ గార్డ్ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌గా ఉంటారని వెల్లడించారు. మారిన పేర్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పేరు మార్పుకు వారి జీతం, రిక్రూట్‌మెంట్ విధానం, ప్రస్తుత విధులు, బాధ్యతలు, సీనియారిటీ, పదోన్నతులతో సంబంధం లేదని రైల్వే శాఖ పేర్కొంది.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM