నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

by సూర్య | Wed, Jan 12, 2022, 09:28 AM

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు. నితిన్ గడ్కరీకి రెండోసారి కరోనా సోకింది.కరోనా మొదటి వేవ్‌లో కూడా గడ్కరీకి కరోనా సోకింది.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు యూనియన్ రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది.కరోనా సోకిన తర్వాత, గడ్కరీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనతో గత వారం రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా ముప్పులో రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర మంత్రులు కూడా నిరంతరం కరోనా బారిన పడుతూ ఉన్నారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాధా మోహన్ సింగ్ కూడా సోషల్ మీడియా ద్వారా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Latest News

 
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు Tue, May 07, 2024, 08:13 PM
చేనేతలకి బీజేపీ ఆ మాట చెప్పగలదా ? Tue, May 07, 2024, 07:13 PM
హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Tue, May 07, 2024, 07:12 PM
ఎవ‌రు మీకు మంచి చేశారో ఆలోచించి ఓటు వెయ్యండి Tue, May 07, 2024, 07:12 PM
కాపు కార్పొరేషన్ ను చంద్రబాబు ఓ ప్రహాసనంగా మార్చారు Tue, May 07, 2024, 07:11 PM