by సూర్య | Wed, Nov 24, 2021, 10:42 PM
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.ఇస్లామాబాద్లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ.. 'మన పాకిస్థాన్ లో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం మన దగ్గర లేదు . అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది''అని అయన తెలిపారు .అప్పుల భారం పెరిగిపోతుండటం దేశంలో పన్నులు సరిగా వసూలు అవడం లేదు 'జాతీయ భద్రత' అంశంగా మారిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు . గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని తెలిపారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజా సంక్షేమానికి బడ్జెట్ కేటాయించలేకపోతున్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్ డాలర్లు అప్పు చేసిందని చెప్పారు . ఈ అప్పుల నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు .పాకిస్థాన్ లో 22కోట్ల జనాభా ఉన్నారు అందులో కేవలం 30లక్షల మంది మాత్రమే పన్నులు కడుతున్నారు అని పాకిస్థాన్ దేశ ఆర్థిక సలహాదారు షౌకత్ టరిన్ గతంలో తెలిపారు . వారిలో 15లక్షల మందికి పన్నులు వెంటనే చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు కూడా జారీ చేశారు.
Latest News