by సూర్య | Mon, Nov 22, 2021, 09:16 PM
బెంగళూరులో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో 46 ఏళ్ల సెక్యూరిటీ గార్డును అతని ఇద్దరు కుమార్తెల ముందే దుండగులు హత్య చేశారు. మృతుడు గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జికెవికె)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బీహార్కు చెందిన దీపక్ కుమార్ సింగ్గా గుర్తించారు. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర్ సాగర్ రోడ్డులో దీపక్ కుమార్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నలుగురు దుండగులు సింగ్ ఇంట్లోకి చొరబడి, కొడవళ్లతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేశారు. దీపక్ భార్య బీహార్ వెళ్లడంతో ఇంట్లో ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగా ఉన్నారు. హంతకులు కూతుళ్ల మెడపై కూడా కొడవళ్లు పెట్టి బెదిరించారు. యలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. హత్య వెనుక గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
Latest News