by సూర్య | Sun, Nov 21, 2021, 09:14 AM
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం రాజీవ్ నగర్ గ్రామంలోచోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరవరం పంచాయతీ రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన బెజ్జంకి సాయితరుణ్ (20) తన నివాసంలో విద్యుత్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్ కు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
Latest News