by సూర్య | Fri, Nov 19, 2021, 12:02 AM
గురువారం జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలో చేరి ఆయుధాల్లో శిక్షణ నేర్చుకుందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ వెళ్తున్న ముగ్గురు బాలలను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.పోలీసులు వివరాల ప్రకారం.. 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు సుల్తాన్ ఖండే, ఫుర్కాన్ నజీర్ ఖండే, కమ్రాన్ సజాద్ షేక్లు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.వీళ్లు కశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాకు చెందినవారు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న తయాబ్ ఫరోకీ అనే ఉగ్రవాద కమాండర్తో సోషల్ మీడియాలో వారికి సంబంధాలు పెట్టుకుని . ఈ క్రమంలో తయాబ్ ఫరోకీని కలిసేందుకు కుప్వారా మీదుగా వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అయితే వీళ్లు ఈ చిన్న వయస్సులో బాధ్యతాయుతమైన, శాంతిని పాటించే పౌరులుగా సంస్కరించడానికి వారికి అవకాశం కల్పించాలని పోలీసులు నిర్ణయం తీస్కున్నారు .
Latest News