by సూర్య | Wed, Oct 27, 2021, 07:36 AM
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా నేడు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో సునాయసంగా నెగ్గింది. తొలుత కరీబియన్లను 143 పరుగులకే పరిమితం చేసిన సఫారీలు ఆపై 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు. ఐడెన్ మార్ క్రమ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. మరో ఎండ్ లో వాన్ డుర్ డుస్సెన్ 43 పరుగులు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ టెంబా బవుమా 2 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ 1 వికెట్ తీశాడు.
Latest News