by సూర్య | Tue, Oct 26, 2021, 11:29 AM
రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు నగరం మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ తగ్గుముఖం పట్టాయి. సోమవారం 290 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మంది, దక్షిణకన్నడలో 30, తుమకూరులో 26 మందికి వైరస్ సోకింది. 10 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. నా లుగు జిల్లాల్లో 20లోపు బాధితులు ఉన్నారు. 408మంది కోలుకోగా 10 మంది మృతి చెందారు. ఇంకా 8,583మంది చికిత్సలు పొందుతున్నారు. ఐదు జిల్లాల్లో 10 మందిలోపు యాక్టివ్కేసులు కాగా గదగ్లో వారం రోజులుగా ఒక యాక్టివ్కేసు లేకపోవడం విశేషం.
Latest News