by సూర్య | Mon, Oct 25, 2021, 04:33 PM
టీ20 వరల్డ్ కప్ లో దాయాది దేశాల మధ్య జరిగిన రసవత్తరపోరులో టీమీండియా ఘోర పరాభవాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కారు. భారతదేశంపై పాక్ సాధించిన విజయాన్ని ఇస్లాం విజయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
పాకిస్తాన్ కు చెందిన మినిస్టర్ షెయ్ రషీద్ అహ్మద్ టీమిండియాపై పాక్ విజయం అనంతరం స్పందించారు. '' ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్నంతసేపు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్ వరకు నిన్న జరిగిన మ్యాచ్ ఫైనల్తో సమానం. ఇది పాక్ విజయం కాదు.. ఇస్లాం విజయం'' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Latest News