సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్‌ మినిస్టర్‌

by సూర్య | Mon, Oct 25, 2021, 03:44 PM

ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌ లో దాయాది దేశాల మధ్య జరిగిన రసవత్తరపోరులో టీమీండియా ఘోర పరాభవాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మినిస్టర్‌ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంపై పాక్‌ సాధించని విజయాన్ని ఇస్లాం విజయంగా వర్ణించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు...పాకిస్తాన్‌ కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియాపై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. '' ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం'' అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Latest News

 
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM