మళ్లీ పెరగనున్న పాల ధర?

by సూర్య | Sun, Oct 24, 2021, 01:43 PM

కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ పాలధర పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాడి నిర్వహణ భారంగా మారడంతో లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచాలంటూ కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన సంగతి విదితమే. ఈ మేరకు సమాఖ్య డైరెక్టర్‌ కాపు దివాకర్‌శెట్టి శనివారం సంకేతాలు అందించారు. రెండేళ్లుగా పాలధర పెంచలేదని పేర్కొన్న ఆయన కొవిడ్‌ అవధిలో పాడిపరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని చవిచూసిందన్నారు. మొత్తం 14 పాల డెయిరీలు కూడా ధర పెంపు డిమాండ్‌ను చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని మొత్తం 14 డెయిరీలతో సమాఖ్య పనిచేస్తోందని, ప్రతిరోజూ 51 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోందని, వీటిలో నేరుగా ప్రజలకు విక్రయించే పాలు మినహాయించగా మిగిలిన పాలను ఉత్పత్తులుగా మార్చి దేశమంతటా విక్రయిస్తోందన్నారు. పాలధర పెంపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

Latest News

 
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM