by సూర్య | Fri, Oct 22, 2021, 06:48 PM
పచ్చదనం మాట తర్వాత చెట్ల వల్ల ప్రాణాలు పోతాయామోనని ప్రజలు భయపడిపోతున్నారు. గాలీ పీల్చాలంటే టెన్షన్ పడుతున్నారు. ఇదంతా విఖపట్నంలో జరుగుతుంది. కొన్ని చెట్లతో అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నాటిన ఏడాకుల చెట్ల వల్ల ఈ పాట్లు వచ్చాయి. ఆ చెట్ల నుంచి వస్తున్న వాసన పీల్చడంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. హుద్హుద్ తుఫాన్ వల్ల అక్కడ చెట్లన్నీ కుప్పకూలిపోతే.. అధికారులు గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టి.. నగరంలోని రహదారుల్లో ఏడాకుల చెట్లను నాటారు. ఆల్ స్టోనియా స్కోలరీస్ అనే శాస్త్రీయ నామమున్న ఏడాకుల మొక్కలను ఐదు లక్షలకు పైగా నాటారు. ఇవి అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన ఈ మొక్కలు పూత దశకు వచ్చాయ్. అయితే ఈ చెట్ల కింద నిలబడితే తలనొప్పి, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దాంతో ప్రజలు ఈ డెవిల్ ట్రీలను తొలగించాలని కోరుతున్నారు.
Latest News