కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు

by సూర్య | Thu, Jun 10, 2021, 12:41 PM

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. భారీ ఊరట కలిగించింది. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ లీవ్స్ అందరికీ వర్తించవు. కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ అని వస్తేనే.. ఈ సెలవులు తీసుకోవడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు కూడా జారీ చేసింది. అంటే తల్లి, తండ్రి, భాగస్వామి, పిల్లలకు కోవిడ్ 19 సోకితే అప్పుడు ఉద్యోగి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ పొందొచ్చు. ఒకవేళ 15 రోజులు దాటిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉంటే అప్పుడు ఉద్యోగులు అందుబాటులో ఉన్న ఏ రకమైన సెలవులను అయినా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వివరించింది. హాస్పిటల్ నుంచి డిస్‌చార్జ్ అయ్యేంత వరకు సెలవులు పొందొచ్చని పేర్కొంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగికే కోవిడ్ 19 పాజిటివ్ వస్తే.. అప్పుడు వీరు 20 రోజుల వరకు కమ్యూటెడ్ లీవ్ తీసుకోవచ్చు. హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కోసం ఈ సెలవులు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఈ సెలవులు అయిపోయినా కూడా కోలుకోకపోతే అప్పుడు ఇతర సెలవులు కూడా తీసుకోవచ్చు.

Latest News

 
మహిళను ఉరి తీసి చంపిన సంఘటన Fri, May 17, 2024, 05:43 PM
గొడవలు పడకుండా సమన్వయం పాటించండి: శెట్టిపల్లి రఘురాంరెడ్డి Fri, May 17, 2024, 05:41 PM
శ్రీరాముల గుడికి ఉత్సవ విగ్రహాలు బహుకరణ Fri, May 17, 2024, 05:39 PM
హైబీపీని తక్కువ అంచనా వేయకూడదు : డాక్టర్ సాంబశివారెడ్డి Fri, May 17, 2024, 05:36 PM
ఆటో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు Fri, May 17, 2024, 05:33 PM