ముంబయిలో కూలిన మూడంతస్తుల భవనం

by సూర్య | Thu, Jun 10, 2021, 09:05 AM

ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ మలాడ్‌లోరద్దీగా ఉండే ఒక ప్రాంతంలో ఒక మూడంతస్తుల భవనం కుప్పకూలింది.బుధవారం రాత్రి 11 గంటలకు జరిగిన ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.భవనం కూలిపోవడంతో, దాని చుట్టుపక్కల మరో మూడు ఇళ్లను ఖాళీ చేయించినట్లు బీఎంసీ చెప్పింది. అవి కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపింది.ఈ ఘటనలో గాయపడినవారిని బీడీబీఏ మునిసిపల్ ఆస్పత్రికి తరలించారు. భవనం కూలిన సమయంలో లోపల పిల్లలుసహా చాలామంది ఉన్నారు.అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సాయంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అవి ఉదయం కూడా కొనసాగాయి.


 

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM