by సూర్య | Tue, Jun 08, 2021, 11:02 AM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సీఎం జగన్కు లేఖ రాశారు. ఔషధం తయారీ సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని విన్నవించారు. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా సహాయసహకారాలు అందించాలని కోరారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరో వైపు.. ఇవాళ నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ ఔషధాన్ని ఇంటింటికీ చేరవేస్తున్నారు. మందు కోసం ఇతర ప్రాంతాల వారిని అనుమతించని పోలీసులు.. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలును కొనసాగిస్తున్నారు. ఆనందయ్య ఔషధంలో ఒకటైన కె రకానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మందును రాష్ట్ర ప్రజలందరికీ అందజేయడానికి ప్రభుత్వం సహకారం కావాలని.. ప్రభుత్వం నుంచి తనకు సాయం అందడం లేదని ఆనందయ్య నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
Latest News