మద్యం మత్తులో కారుతో హల్ చెల్ చేసి వ్యక్తి పరార్

by సూర్య | Fri, Jun 04, 2021, 03:04 PM

విశాఖ తాటిచెట్లపాలెం మురళీనగర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపి పలు వాహనాలను ఢీకొట్టి పరారయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళీనగర్‌ వర్మ కాంప్లెక్స్‌ ప్రాంతంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో తన హోండా కారులో వస్తూ రోడ్డు మీద పలువురి వాహనాలను ఢీకొన్నాడు. ఆ తర్వాత కారును నియంత్రించలేక పోవడంతో ఓ డ్రైనేజీ మీదకు దూసుకుపోయి ఆగింది. వెంటనే కారు దిగి ఆ వ్యక్తి పరారయ్యాడు. కారు ఇక్కడ ఆగకపోతే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. మద్యం మత్తులో కారును అతివేగంగా తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఈ సంఘనటలో ఆరు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అతను ఢీ కొట్టాడని వారు తెలిపారు. వీరంతా కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM