వివాహేతర సంబంధం... దారుణ హత్య

by సూర్య | Mon, Apr 12, 2021, 12:09 PM

ఓ మహిళ తన బావతో కలిసి తన భర్తను హత్య చేసింది. హత్య జరిగిన 5 నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అగర్తల పరిధిలోని నాగ్పాడకు చెందిన ఉత్తమ్ దాస్(45) తన సోదరుడు తపన్ దాస్(51) తో కలిసి నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో ఉత్తమ్ దాస్ భార్య రూపా దాస్ తో తపన్ దాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు ఉత్తమ్ దాస్ ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అతడిని చంపడం కోసం ప్లాన్ వేశారు. తమ ప్లాన్ లో భాగంగా కిరాయి గుండాల సాయంతో ఉత్తమ్ దాస్ ను చంపి కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేసారు. తపన్ దాస్, రూపా దాస్ కలిసి ఉత్తమ్ దాస్ కరోనా చనిపోయాడని తన శవాన్ని కూడా తీసుకురాకుండా పూడ్చిపెట్టినట్లు బంధువులకు కట్టుకథ చెప్పారు. 5 నెలల తర్వాత ఆస్తిని రూపా దాస్ పేరిట రాయించడానికి ఆమె భర్త డెత్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చింది. దీంతో వాళ్లు రాజస్థాన్ వెళ్లి ఒక ప్రభుత్వ డాక్టర్ ను డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. డబ్బులిస్తామన్నారు. కానీ, ఆ డాక్టర్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించిన వాళ్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM