by సూర్య | Sat, Apr 03, 2021, 12:33 PM
ఐపీఎల్ 2021 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్ ను ప్రకటించాడు. ఆ టీమ్ కు కెప్టెన్ గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలను తీసుకున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని తీసుకున్నాడు. నాలుగో స్థానానికి కేన్ విలియమ్స్న్, స్టీవ్ స్మిత్తో పాటు తన పేరును కూడా డివిలియర్స్ ప్రకటించాడు. ఆల్ రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజాలను సెలెక్ట్ చేశాడు. పేస్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రబాడాలను తీసుకున్నాడు. స్పిన్ బాధ్యతల కోసం రషీద్ ఖాన్, జడేజాను పరిగణలోకి తీసుకున్నాడు.
డివిలియర్స్ ప్రకటించిన ఆల్టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్ టీం:
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
Latest News