రూ.10 కే కడుపునిండా భోజనం!

by సూర్య | Tue, Mar 30, 2021, 03:30 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం రోజూ భారీ సంఖ్యలో జనాలు వస్తుంటారు. అలా రోజూ ఈ ఆస్పత్రి వద్దకు వచ్చే వేల మంది పేదవారికి ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్’ మహిళా సభ్యులు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నారు. పేద వారి ఆకలి తీర్చడం కోసమే ఆ 10 మంది మహిళలు 10 రూపాయలకే భోజనం అందిస్తున్నారు.


ఈ మహిళలు కూడా సామాన్య కుటుంబీకులే. ఏడాది క్రితం ఒక ట్రస్ట్ లో సభ్యులుగా చేరి.. అక్కడ వంటలు చేయడంలో శిక్షణ తీసుకున్నారు. సేవతో కూడిన వ్యాపారాన్ని చేయాలనుకున్నారు.


దీంతో వైద్యం కోసం వచ్చిన వారు తిండి కోసం పడుతున్న ఇబ్బందులు చూసి జీజీహెచ్ అస్పటల్ ఎదురుగా ఫలహారశాల పేరుతో ఓ హోటల్ ను ఏర్పాటు చేశారు. కేవలం రూ.10 లకే కడుపునిండా భోజనం పెడుతున్నారు. రోగుల కోసం ప్రత్యేకంగా జావ, మిరియాల చారు లాంటివి కూడా దొరుకుతాయి. పెరుగన్నం, పులిహోర, చికెన్‌ బిర్యానీ వంటివి వీళ్లు అందించే మెనూలో ఉంటాయి.


ఇలా రోజుకి ఈ హోటల్ లో 300 నుంచి 500 మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఈరోజుల్లో 10 రూపాయలకు టీ కూడా రావడం లేదు. అలాంటి ప్రస్తుత కాలంలో పది రూపాయలకే భోజనం అందిస్తున్న వీరిని హాస్పటల్ కి వచ్చి.. ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్న వారు అన్నపూర్ణలు అని అంటున్నారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM