ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండ

by సూర్య | Tue, Mar 30, 2021, 09:15 AM

రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 76 సంవత్సరాల తర్వాత మార్చిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. నగరంలోని సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ అని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం అధిపతి కుల్దీప్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 31 మార్చి 1945లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా రికార్డయిందని, ఆ తర్వాత దేశ రాజధానిలో మార్చిలో ఇదే అత్యంత ఉష్ణోగ్రత ఉన్న రోజని చెప్పారు.


అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆకాశం నిర్మలంగా ఉండడం, గాలివేగం తక్కువగా ఉండడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. 1973, మార్చి 29న నగరంలో గరిష్ఠంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది మార్చిలో మూడో అత్యంత వేడిమి ఉన్న రోజన్నారు. నజాఫ్‌గఢ్‌, నరేలా, పిటాంపురా, పూసాలోని వాతావరణ కేందాల్లోవరుసగా 41.8 నుంచి 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.6 డిగ్రీలకు చేరాయి.


 


ఇది సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. ‘హీట్‌ వేవ్‌’గా ప్రకటిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత నుంచి 6.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ‘తీవ్రమైన’ వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రతను 38 డిగ్రీలకు పడిపోతుందని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM