by సూర్య | Wed, Mar 24, 2021, 11:45 AM
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈఓ సురేష్ బాబు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దుర్గమ్మ ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఏసీబీ దాడులు ఉద్యోగుల సస్పెన్షన్, ఈ ఏడాది ఆర్ధిక బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై పాలకమండలి సమావేశంలో సభ్యులు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Latest News