by సూర్య | Wed, Mar 24, 2021, 09:14 AM
గల్ఫ్ దేశం కువైట్లో 30 ఏళ్ల ఓ భారత బైకర్ దుర్మరణం చెందారు. కువైట్లోని వఫ్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును బైక్పై వెళ్తున్న భారత వ్యక్తి వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తలకు బలమైన గాయాలు కావడంతో భారీగా రక్తస్రావమై వెంటనే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు భారతీయుడని మాత్రమే తెలుసని, మిగతా వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.
Latest News