ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

by సూర్య | Fri, Jan 15, 2021, 11:54 AM

కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్వాడ్‌ జిల్లాలోని ఇట్టిగట్టి గ్రామం వద్ద ఓ ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM