by సూర్య | Fri, Jan 15, 2021, 11:54 AM
కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్వాడ్ జిల్లాలోని ఇట్టిగట్టి గ్రామం వద్ద ఓ ట్రావెల్స్ వ్యానును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ వ్యానులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News