by సూర్య | Fri, Jan 15, 2021, 10:09 AM
బెంగళూరు : కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్ను వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Latest News