by సూర్య | Tue, Jan 12, 2021, 01:23 PM
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు కరోనా సోకింది. ఈరోజు బ్యాంకాక్ లో థాయిలాండ్ ఓపెన్ సందర్భంగా క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమెతో పాటు హెచ్ఎస్ ప్రణోయ్ అనే మరో ప్లేయర్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిద్దరూ ఆ టోర్నమెంట్ నుండి వైదొలిగినట్లు బీఏఐ మీడియా విభాగం ప్రకటించింది. వీరిద్దరూ ఆసుపత్రిలో చేరి, 10 రోజులు ఐసొలేషన్ లో ఉంటారని వెల్లడించింది.
Latest News