అకౌంట్లలో వచ్చిపడ్డ డబ్బు...

by సూర్య | Thu, Jan 07, 2021, 11:14 AM

విజయనగరం జిల్లాలో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమకావడం సంచలనంగా మారింది. ఎవరు వేశారో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.. డబ్బులు వచ్చి ఖాతాల్లో పడుతున్నాయి.. జనాలు కూడా పండగ చేసకుంటున్నారట. సాలూరు మండలంలోని శివరాంపురంకు చెందిన దాదాపు 200మంది అకౌంట్లలో ఒకేసారి డబ్బులొచ్చి చేరాయి. వెయ్యి, రెండు వేలు కాదు.. ఏకంగా రూ.13,500 నుంచి రూ.16 వేల మధ్య డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్కసారిగా డబ్బులు అకౌంట్లలో పడటంతో జనాలు కూడా అవాక్కయ్యారట.


ఇలా అకౌంట్లలో డబ్బులు జమ కావడంతో కలకలంరేగగా.. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. ఒకవేళ రైతు భరోసా పథకానికి చెందిన డబ్బులు అనుకుటే.. భూమి లేని వారికి కూడా డబ్బు జమ అయ్యింది. చాలా మంది ఖాతాదారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వివరాలను తెలియజేయడం లేదట. బ్యాంక్ అధికారుల్ని ఈ విషయంపై ఆరా తీయగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదంటున్నారు.


 


ప్రస్తుతం బ్యాంకు ఖాతా నంబరు ఆధార్‌తో లింక్‌ చేసి ఉన్నందున తప్పుగా డబ్బులు పడే అవకాశం లేదని.. దీనిపై ఆరా తీస్తున్నాము అంటున్నారు. ఇదిలా ఉంటే పొరపాటుతో బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఊరి పెద్దల్ని సంప్రదిస్తే.. ప్రకాశం జిల్లా శివరాపురంకు చెందినవారి డబ్బులు పొరపాటున విజయనగరం జిల్లా శివరాపురం వ్యక్తులకు జమ అయ్యాయని గుర్తించారట.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM