by సూర్య | Thu, Jan 07, 2021, 09:37 AM
భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్టు నేడు సిడ్నీలో ప్రారంభమైంది. ఇరు జట్లూ సిరీస్ లో 1-1తో సమానంగా నిలవడంతో మూడో టెస్ట్ విజయంపై ఉత్కంఠ నెలకొంది. మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 6 పరుగుల స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ ఔటయ్యాయి. ఆ తరువాత కొద్ది సేపటికే వర్షం కారణంగా ఆట నిలిచింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 21 పరుగులు.
Latest News