by సూర్య | Sun, Oct 11, 2020, 05:27 PM
శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి నీళ్లు రావడంతో ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 32,293 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 58,074 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.90 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉందని, శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Latest News