కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన రాహుల్ గాంధీ

by సూర్య | Thu, Mar 26, 2020, 07:11 PM

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల పేద, బలహీన తరగతి ప్రజలు ఇబ్బందుల పాలుకాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఏకంగా 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో కేంద్రం భారీ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. పేదలు, రోజువారీ కూలీల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరైన నిర్ణయమని ఆయన అన్నారు. సరైన దిశలో తీసుకున్న తొలి అడుగని ప్రశంసించారు. లాక్ డౌన్ ను భరిస్తున్న రైతులు, కూలీలు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM