ఆర్థికమంత్రి సమావేశంపై నెలకొన్న ఉత్కంఠ !

by సూర్య | Thu, Mar 26, 2020, 05:02 PM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో కరోనాపై 21 రోజుల పోరు కొనసాగుతున్న తరుణంలో గురువారం మధ్యాహ్నం 1 గంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడన్నారు. ఇటీవల ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందనీ, త్వరలోనే వివరాలను ప్రకటించనున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే పలు విషయాల్లో నిబంధనలను సడలించిన ఆర్థికమంత్రి తాజా సమావేశంపై మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు దృఢంగా కొనసాగుతున్నాయి. ఉపశమన చర్యలతో దేశ ప్రజలకు భారీ ఊరట లభించనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM