హర్యానాలో 19 జైళ్ల నుండి ఖైదీలు విడుదల

by సూర్య | Thu, Mar 26, 2020, 04:57 PM

కరోనా వైరస్ 19 జైళ్లలో ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా ఖైదీలను పెరోలు, లేదా బెయిలుపై విడుదల చేయాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈ సందర్భంగా హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంలో ఖైదీలతో రద్దీగా ఉన్న19 జైళ్లలో ఏడేళ్ల కారాగార శిక్ష పడిన ఖైదీలను పెరోల్, బెయిలుపై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జైళ్ల నుంచి ఖైదీల విడుదలకు జైలులో వారి ప్రవర్తన, వారిపై ఉన్న ఇతర కేసుల గురించి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా విదేశీ ఖైదీలను విడుదల చేయబోమని మంత్రి చెప్పారు. జస్టిస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ విజయ్ వర్దన్, జైళ్లశాఖ డైరెక్టరు జనరల్ కె సెల్వరాజ్ లు పాల్గొన్నారు.

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM