సీఎం ప్రెస్‌మీట్‌ కు వెళ్లిన విలేకరికి కరోనా

by సూర్య | Thu, Mar 26, 2020, 10:30 AM

వర్కింగ్ జర్నలిస్టుల కాస్తంత వళ్లుదగ్గర పెట్టుకుని పనిచేయాలని కరోనా వైరస్ హెచ్చరించింది. కరోనా ఏం చేస్తుందిలే అని భావించి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ తిరిగినా, ఇష్టానుసారంగా ప్రెస్‌మీట్లకు వెళ్లినా తాను సోకకుండా మానను అని హెచ్చరించింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన ఓ విలేకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ సమావేశానికి హాజరైన విలేఖరులందరినీ హౌస్ క్వారంటైన్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారుతాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మార్చి 20వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు అదే సమావేశానికి హాజరైన మిగతా జర్నలిస్టులను హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, బాధిత జర్నలిస్టుకు అతడి కుమార్తె ద్వారా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.


మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క భోపాల్‌లోనే 15 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


 


 

Latest News

 
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM
తెనాలిలో ఎమ్మెల్యే చెంప దెబ్బ వ్యవహారంలో మరో ట్విస్ట్ Sat, May 18, 2024, 08:51 PM
కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట .. ఒక్కటి దొరికితే చాలు లక్షల్లో డబ్బు Sat, May 18, 2024, 08:50 PM