by సూర్య | Thu, Mar 26, 2020, 09:04 AM
అమరావతి :పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం టోల్ఫ్రీ నం. 1902 ఏర్పాటు చేసింది. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీకృష్ణబాబు నేతృత్వంలో రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ విజయవాడ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నిత్యావసరాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే ఈ నంబరుకు ఫోన్చేసి చెప్పాలని సీఎస్ సూచించారు.
Latest News